వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ముస్లిం రిజర్వేషన్లపై సుప్రీంకు ప్రభుత్వం
న్యూఢిల్లీ: ముస్లిం రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. విద్య, ఉద్యోగాల్లో ముస్లిమ్లకు ఐదు శాతం రిజరేష్వన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టేసింది. తన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం కల్పించింది.
ముప్లిం రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, బలంగా వాదించకపోవడం వల్లనే హైకోర్టు రిజర్వేషన్ల ఆదేశాలను కొట్టేసిందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. దీంతో సుప్రీంకోర్టులో తన వాదనను బలంగా వినిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. మత ప్రాతిపదికపై కాకుండా సామాజిక వెనుకబాటును ప్రాతిపదికగా తీసుకుని ముస్లిమ్లకు రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు ప్రభుత్వం వాదించనుంది.
Comments
Story first published: Wednesday, December 14, 2005, 23:53 [IST]