వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వోకర్ నివేదిక: ఇడి ముందు జగత్ హాజరు
న్యూఢిల్లీ: ఇరాకీ చమురు కుంభకోణం వ్యవహారంలో మాజీ విదేశాంగ మంత్రి నట్వర్ సింగ్ కుమారుడు జగత్ సింగ్ గురువారంనాడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ముందు హాజరయ్యారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బృందం జోర్డాన్, ఇరాక్లలో పర్యటించి వచ్చిన అనంతరం జగత్ సింగ్ను ఇంటరాగేట్ చేయడం గమనార్హం. 2001 జరిగిన బ్యాంక్ లావాదేవీలపై ఆ బృందం ఆరా తీసి వచ్చింది.
క్రోషియాలో మాజీ రాయబారి మత్రానీ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జగత్ సింగ్కు సమన్లు జారీ చేసింది. మత్రానీ ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా బగ్దాద్లో ఉన్నారు. సద్దాం హుసేన్ పాలనా కాలంలో పెద్ద మొత్తంలో డబ్బు జోర్డాన్లోని మూడు బ్యాంక్ల్లో జమ అయినట్లు వార్తలు వెలువడ్డాయి. 2001లో తన తండ్రితో పాటు తాను ఇరాక్ వెళ్లినట్లు జగత్ సింగ్ అంగీకరించారు.
Comments
Story first published: Thursday, December 15, 2005, 23:53 [IST]