వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జర్నలిస్ట్టైగర్ జాక్ ఆండర్సన్ మృతి
వాషింగ్టన్:ఇన్వెస్టిగేటివ్ జర్నలిజమ్ పితామహుడు,ప్రతిష్టాత్మక పులిజర్ అవార్డు గ్రహీత జాక్ఆండర్సన్ శనివారం మృతి చెందారు.ఆయన వయస్సు 83 సంవత్సరాలు. బెతెస్డాలోని స్వగృహంలో అండర్సన్మరణించారని ఆయన కుటుంబ సభ్యులుతెలిపారు. గత కొంతకాలంగా ఆయనపార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్నారు.
వాషింగ్టన్పత్రికలో మెర్రి-గో- రౌండ్ కాలమ్ఆయనకు ఎనలేని కీర్తిని ఆర్జించిపెట్టింది. ఎన్నోకుంభకోణాలనువెలికితీసిన ఘనత అండర్సన్కుఉంది. అంతేగాక అండర్సన్ డజనుకుపైగాపుస్తకాలు రాశారు.
1971లో జరిగిన ఇండియా-పాకిస్థాన్యుద్ధంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు నిక్సన్రహస్యంగా పాకిస్థాన్ వైపు మెగ్గుచూపారనిఅండర్సన్ బహిర్గత పరిచి సంచలనంసృష్టించారు. ఇందుకు అండర్సన్కు ప్రతిష్టాత్మకపులిజర్ అవార్డు లభించింది.
Story first published: Sunday, December 18, 2005, 23:53 [IST]