లక్ష్మణ్, ధోనీవిజృంభణ- భారత్ 247/6
అహ్మదాబాద్:హైదరాబాది బ్యాట్స్మన్ లక్ష్మణ్, ఇండియన్క్రికెట్టార్జాన్ థోని రాణించడంతో శ్రీలంకతో అహ్మదాబాద్లోప్రారంభమైన మూడోటెస్ట్ తొలిరోజు భారత్ఆరు వికెట్లకు 247 పరుగులు సాధించింది.అనారోగ్యంతో ద్రావిడ్ ఈ టెస్ట్కు దూరం కావడంతోవీరేంద్ర సెహ్వాగ్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించాడు. టాస్ గెలిచినభారత్ బ్యాటింగ్ఎంచుకుంది.
ఆరంభంలో గంభీర్రూపంలో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. 19పరుగులుచేసిన గంభీర్ జట్టు స్కోరు 31పరుగుల వద్ద మలింగ బౌలింగ్లోతరంగకు క్యాచ్ ఇచ్చివెనుదిరిగాడు.
జట్టుస్కోరు మరో21 పరుగులకు సెహ్వాగ్ (20) మలింగ్ బౌలింగ్లోబౌల్డ్ అయ్యాడు. మెరుపులు మెరిపిస్తాడనుకున్నసచిన్ 23 పరుగులకే మురళీధరన్స్పిన్కు బలయ్యాడు. యువరాజ్ (0), కైఫ్(4)లు ఏమాత్రం ప్రతిఘటించకుండానేవెనుదిరిగాడు. ఈ దశలో థోనీతో కలిసి స్టయిలిష్బ్యాట్స్మన్ లక్ష్మణ్ భారత్ను ఆదుకున్నాడు.ఏడోవికెట్కు వీరిద్దరూ 106 పరుగులు జోడించడంతోభారత్ ఆశలు చిగురించాయి. చక్కని షాట్లతోఅలరించిన థోనీ 49 పరుగుల వద్ద మురళీధరన్బౌలింగ్లో ఎల్బిడబ్యుగా వెనుదిరిగాడు.దీనితో వీరిద్దరి భాగస్వామ్యానికి తెరపడింది.
ఈదశలో లక్ష్మణ్కుపఠాన్ బాసటగా నిలిచాడు. మొదటిరోజు ఆట ముగిసేసమయానికి లక్ష్మణ్ 71, పఠాన్ 39 పరుగులతోక్రీజ్లో ఉన్నారు. మురళీధరన్ మూడు,మలింగ్ రెండు, బండారా ఒక వికెట్ పడగొట్టిభారత్ను కట్టడిచేశారు.