వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మొద్దుశీను భార్యను విచారించిన సిబిఐ
అనంతపురం:మాజీమంత్రి, తెలుగుదేశం నాయకుడుపరిటాల రవి హత్య కేసులో రెండోనిందితుడైన మొద్దు శీను భార్యలక్ష్మీరాజ్యంను సోమవారంఅనంతపురంలో సిబిఐ అధికారులు విచారించారు.మొద్దు శీను కదలికలకుసంబంధించి ఆమెను రెండు గంటలసేపు విచారించారు. పరిటాల హత్య అనంతరంమొద్దు శీను ఎప్పుడు ఇంటికి చేరాడు?కుటుంబసభ్యులంతా కలిసి ఢిలీ ఎప్పుడు చేరారు అనేవిషయాలను ప్రశ్నించినట్టుతెలుస్తోంది. విచారణ అనంతరం బయటకు వచ్చినఆమెను మీడియాప్రతినిధులు ప్రశ్నించగా ఆమె ఎటువంటివివరాలు చెప్పలేదు. తనను, తమపిల్లలను కలుసుకునేందుకు భర్తశీను నిరాకరించాడని మాత్రం ఆమెచెప్పింది.
Comments
Story first published: Monday, December 19, 2005, 23:53 [IST]