రెండుజిల్లాల ఎస్పీలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల ధ్వజం
హైదరాబాద్:ప్రకాశం, గుంటూరు జిల్లాల ఎస్పీలుపైశాచికంగా వ్యవహరిస్తున్నారని, వారిమీద చర్యలు తీసుకోవాలని ఇద్దరుకాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.ప్రకాశం జిల్లా యువజన కాంగ్రెస్అధ్యక్షుడు గొర్రెపాటి శ్రీనివాసరావునుఆ జిల్లా ఎస్పీ బాలసుబ్రమణ్యం అకారణంగాకొట్టారని ఒంగోలు ఎమ్మెల్యే శ్రీనివాసులు రెడ్డి,గుంటూరు ఎమ్మెల్యే, రాష్ట్ర యువజనకాంగ్రెస్ అధ్యక్షుడు వెంకటరావుసోమవారం అసెంబ్లీలో ప్రస్తావించారు. గుంటూరు జిల్లాఎస్పీ సజ్జనార్ కూడాఇదేవిధంగా విచక్షణ రహితంగావ్యవహరిస్తున్నారని వారువిమర్శించారు. స్కూలు పిల్లలకు రోడ్లపైరక్షణ కల్పించడంలో నగర పోలీసులునిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, పోలీసుల్లోబాధ్యతా రాహిత్యంపెరిగిపోతోందని, అనవసర విషయాలపైవారు దృష్టి సారిస్తున్నారని, దీనిపైహోంమంత్రి సమాధానం చెప్పాలనివెంకటరావు కోరారు. ఇద్దరుఅధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పోలీసుఅధికారుల వైఖరిని ఆక్షేపించడం విశేషం.