వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఛాయాదేవికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ప్రముఖ రచయిత్రి అబ్బూరి ఛాయాదేవికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆమె రాసిన తన మార్గం అనే కథల సంపుటికి ఈ అవార్డు లభించింది. సీనియర్‌ రచయిత్రి అయిన అబ్బూరి ఛాయాదేవి ప్రస్తుతం హైదరాబాద్‌లో వుంటున్నారు. ఆమెది తెలుగు కథారచనలో అందె వేసిన చేయి. తెలుగు అకాడమీ ఇటీవల ప్రచురించిన కథాకోశం అనే భారీ పుస్తకానికి ఆమె సహాయ సంపాదకురాలిగా వ్యవహరించారు.

తెలుగు కథారచయితలను, వారి కథల శీర్షికను ప్రచురించిన ఈ కథా కోశం పుస్తకానికి డాక్టర్‌ ముదిగంటి సుజాతారెడ్డి మరో సహాయ సంపాదకురాలు. ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు దీనికి ప్రధాన సంపాదకుడిగా వ్యవహరించారు. అబ్బూరి ఛాయాదేవి ఎంతో కాలంగా కథా రచన చేస్తున్నారు. ఆమె కథలను పాఠక లోకంలో విశేష అదరణ పొందాయి. నిబద్ధ స్త్రీవాద రచయితగా ఆమెకు మంచి పేరుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X