వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఛాయాదేవికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
హైదరాబాద్: ప్రముఖ రచయిత్రి అబ్బూరి ఛాయాదేవికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆమె రాసిన తన మార్గం అనే కథల సంపుటికి ఈ అవార్డు లభించింది. సీనియర్ రచయిత్రి అయిన అబ్బూరి ఛాయాదేవి ప్రస్తుతం హైదరాబాద్లో వుంటున్నారు. ఆమెది తెలుగు కథారచనలో అందె వేసిన చేయి. తెలుగు అకాడమీ ఇటీవల ప్రచురించిన కథాకోశం అనే భారీ పుస్తకానికి ఆమె సహాయ సంపాదకురాలిగా వ్యవహరించారు.
తెలుగు కథారచయితలను, వారి కథల శీర్షికను ప్రచురించిన ఈ కథా కోశం పుస్తకానికి డాక్టర్ ముదిగంటి సుజాతారెడ్డి మరో సహాయ సంపాదకురాలు. ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు దీనికి ప్రధాన సంపాదకుడిగా వ్యవహరించారు. అబ్బూరి ఛాయాదేవి ఎంతో కాలంగా కథా రచన చేస్తున్నారు. ఆమె కథలను పాఠక లోకంలో విశేష అదరణ పొందాయి. నిబద్ధ స్త్రీవాద రచయితగా ఆమెకు మంచి పేరుంది.
Comments
Story first published: Thursday, December 22, 2005, 23:53 [IST]