వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పది మంది యంపీల బహిష్కరణకు సిఫార్సు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సభలో ప్రశ్నలు వేయడానికి లంచం తీసుకుంటూ టీవీ కెమెరాకు చిక్కిన పది మంది పార్లమెంటు సభ్యులను బహిష్కరించాలని ఐదుగురు సభ్యుల సభా సంఘం సిఫార్సు చేసింది. ఆరోపణలు ఎదుర్కున్న పది మంది సభ్యులు నరేంద్ర కుమార్‌ కుష్వాహా (బియస్పీ), అన్నా సాహెబ్‌ యంకె పాటిల్‌ (బిజెపి), మనోజ్‌ కుమార్‌ ( ఆర్జెడీ), వై.జి. మహాజన్‌ (బిజెపి), ప్రదీప్‌ గాంధీ (బిజెపి), సురేష్‌ చండేల్‌ (బిజెపి), రామ్‌సేవక్‌ సింగ్‌ (కాంగ్రెస్‌), లాల్‌ చంద్ర కోల్‌ (బియస్పీ), రాజారామ్‌ పాల్‌ (బియస్పీ), చంద్ర ప్రతాప్‌ సింగ్‌ (బిజెపి).

సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడితే తప్ప ఏ సభ్యుడ్నీ బహిష్కరించడానికి వీలు లేదని సభా సంఘం సభ్యుల్లో ఒకరైన మల్హోత్రా (బిజెపి) తన వ్యతిరేకతను రికార్డు చేశారు. సరైన పద్ధతిని అవలంబించకుండా సభ్యులను బహిష్కరించే సంప్రదాయంలో తాను భాగస్వామిని కాదల్చుకోలేదని ఆయన అన్నారు. ఈ విషయాన్నంతా సభా హక్కుల కమిటీకి నివేదించాలని ఆయన అభిప్రాయపడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X