అలరించినఆటా భాషాస్వరఝరి
హైదరాబాద్:అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా)వేడుకల్లో భాగంగా నిర్వహించిన భాషాస్వర ఝరిలో భాగ్యనగరం ఓలలాడింది.సహస్రావధాని మాడుగుల నాగఫణిశర్మఆధ్వర్యంలో జరిగిన ఈ స్వర ఝరి సంగీత,సాహిత్య ప్రియులను తన్మయుల్ని చేసింది.వివిధ సాహిత్య ప్రక్రియల్లో నిష్ణాతులైనపృచ్ఛకుల ప్రశ్నలకు నాగఫణిశర్మతన అవధాన ప్రతిభతో ఇచ్చిన సమాధానాలుఅబ్బురపరిచాయి.
ఈభాషా స్వర ఝరిలో నన్నయ స్థానాన్ని ఉత్పల సత్యనారాయణాచార్యఅధిష్టించారు. పోతన రూపంలో ప్రకాశరావు,అల్లసాని పెద్దనగా శ్రీనివాసాచార్య, తెనాలిరామలింగడుగా అక్కిరాజు సుందర రామకృష్ణప్రశ్నలు సంధించారు. వీరితోబాటుకసిరెడ్డి,కెవి లక్ష్మి, ఆచార్య ఫణీంద్ర, తిరునగరి,రచయిత్రి శ్రీలత, జెఎల్ నరసింహం,డాక్టర్ ఉదయ పృచ్ఛకులుగా వ్యవహరించారు.గాయని సురేఖామూర్తి ప్రార్థనతో స్వర ఝరి ఆరంభమయింది.సాహిత్యవేత్త, కర్ణాటక రాష్ట్ర మాజీగవర్నర్ డాక్టర్ రమాదేవితొలిపలుకులు విన్పించారు.