వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అలరించినఆటా భాషాస్వరఝరి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (ఆటా)వేడుకల్లో భాగంగా నిర్వహించిన భాషాస్వర ఝరిలో భాగ్యనగరం ఓలలాడింది.సహస్రావధాని మాడుగుల నాగఫణిశర్మఆధ్వర్యంలో జరిగిన ఈ స్వర ఝరి సంగీత,సాహిత్య ప్రియులను తన్మయుల్ని చేసింది.వివిధ సాహిత్య ప్రక్రియల్లో నిష్ణాతులైనపృచ్ఛకుల ప్రశ్నలకు నాగఫణిశర్మతన అవధాన ప్రతిభతో ఇచ్చిన సమాధానాలుఅబ్బురపరిచాయి.

ఈభాషా స్వర ఝరిలో నన్నయ స్థానాన్ని ఉత్పల సత్యనారాయణాచార్యఅధిష్టించారు. పోతన రూపంలో ప్రకాశరావు,అల్లసాని పెద్దనగా శ్రీనివాసాచార్య, తెనాలిరామలింగడుగా అక్కిరాజు సుందర రామకృష్ణప్రశ్నలు సంధించారు. వీరితోబాటుకసిరెడ్డి,కెవి లక్ష్మి, ఆచార్య ఫణీంద్ర, తిరునగరి,రచయిత్రి శ్రీలత, జెఎల్‌ నరసింహం,డాక్టర్‌ ఉదయ పృచ్ఛకులుగా వ్యవహరించారు.గాయని సురేఖామూర్తి ప్రార్థనతో స్వర ఝరి ఆరంభమయింది.సాహిత్యవేత్త, కర్ణాటక రాష్ట్ర మాజీగవర్నర్‌ డాక్టర్‌ రమాదేవితొలిపలుకులు విన్పించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X