వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవినీతికి కాంగ్రెసే కారణం: అద్వానీ

By Staff
|
Google Oneindia TeluguNews

ముంబాయి: కాంగ్రెస్‌ వల్లనే దేశంలో అవినీతి పెచ్చరిల్లిందని భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధ్యక్షుడు ఎల్‌.కె. అద్వానీ అన్నారు. పార్టీ ఐదు రోజుల కార్యవర్గ సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ను గద్దె దించితేనే దేశంలో అవినీతికి అడ్డుకట్ట పడుతుందని ఆయన అన్నారు. వోకర్‌ నివేదిక కాంగ్రెస్‌ అవినీతికి చక్కని నిదర్శనమని ఆయన అన్నారు.

వోకర్‌ నివేదికపై కాంగ్రెస్‌ వైఖరిని వెల్లడించాలని ఆయన సోనియా గాంధీని డిమాండ్‌ చేశారు. దేశంలో కాంగ్రెస్‌ ఆధిపత్యాన్ని అంతం చేయడానికి తాము ముందుకు వచ్చామని, ఆ ప్రయత్నంలో దేశంలో ప్రధాన పార్టీల వ్యవస్థ రూపు దాల్చిందని ఆయన చెప్పారు. మిగతా పార్టీలు ఇటు బిజెపి వైపో, అటు కాంగ్రెస్‌ వైపో ఉండడం పరిపాటి అయిందని ఆయన అన్నారు.

బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు సోమవారం ఇక్కడ ప్రారంభమయ్యాయి. మొదటి మూడు రోజులు పార్టీ భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన కోసం పార్టీ కార్యవర్గ సభ్యులు సమావేశమై చర్చలు జరుపుతారు. ఉమా భారతి వ్యవహారంపై, లంచావతర ఎంపీల వ్యవహారంపై కూడా చర్చలు జరుపుతారు. మిగతా రెండు రోజులు రజతోత్సవాలలో భాగంగా సభలూ ప్రదర్శనలు నిర్వహిస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X