వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వేయి కేసుల్లో నిందితుడు మూర్తి అరెస్టు
హైదరాబాద్: వేయికి పైగా ఇళ్లకు కన్నాలు వేసిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఫకీర్ స్వామి అలియాస్ మూర్తి అనే ఈ నిందితుడు ఇళ్ల దొంగతనాలు మాత్రమే చేస్తూ వస్తున్నాడు. అతని నుంచి 13 లక్షల విలువ చేసే నగలును, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తమిళనాడుకు చెందిన మూర్తి అనే ఈ నిందితుడు ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు కారులో పేర్లు మార్చుకుని సంచరించేవాడని పోలీసులు చెప్పారు. గత 25 ఏళ్లుగా ఇతను ఇళ్లకు కన్నాలు వేస్తున్నాడు. ఏడేళ్ల క్రితం పోలీసులు అతడ్ని మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ జాబితాలో చేర్చారు. గతంతో ఇతన్ని విజయవాడ పోలీసులు ఒకసారి అరెస్టు చేశారు.
Comments
Story first published: Monday, December 26, 2005, 23:53 [IST]