వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
భర్తను కలిసిన మొద్దు శీను భార్య లక్ష్మీరాజ్యం
అనంతపురం: తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు పరిటాల రవి హత్య కేసులో నిందితుడైన తన భర్త మొద్దు శీనును లక్ష్మీరాజ్యం సోమవారంనాడు కలుసుకున్నారు. కేసు గురించి తాను మొద్దు శీనుతో మాట్లాడలేదని ఆమె అనంతరం మీడియా ప్రతినిధులతో చెప్పారు. తమ కుటుంబ విషయాలే తన భర్తతో మాట్లాడినట్లు ఆమె చెప్పారు.
ఇదిలావుంటే, పరిటాల హత్య కేసు నిందితులు కలిసి మాట్లాడుకుంటున్న విషయం నిజమేనని జైలు సూపరింటిండెంట్ ఫజల్ షేక్ చెప్పారు. జైలు సూపరింటిండెంట్ వివరణను ఒక ప్రైవేట్ తెలుగు టీవీ చానల్ ప్రసారం చేసింది. శీనుపై ఆంక్షలు ఎత్తివేశారని, అందువల్ల అందరు ఖైదీల మాదిరిగానే శీను కూడా మిగతావారితో మాట్లాడుతున్నాడని ఆయన చెప్పారు.
Comments
Story first published: Monday, December 26, 2005, 23:53 [IST]