వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పోతిరెడ్డిపాడుపై అనవసర రాద్ధాంతం: పొన్నాల
వరంగల్: పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ వరద జలాలపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని భారీ నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. పోతిరెడ్డి హెడ్రెగ్యులేటర్ సామర్థ్యం పెంపును వ్యతిరేకిస్తూ ఆదివారంనాడు నగర శాసనసభ్యులు సమావేశం నిర్వహించడంపై సోమవారం ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆ విధంగా ప్రతిస్పించారు.
పెండింగ్ నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేయడానికే 170 జీవోను జారీ చేశామని ఆయన చెప్పారు. ఏ ప్రాంతానికి కూడా అన్యాయం చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని ఆయన అన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్పై ప్రభుత్వం వద్ద సమాధానం లేదనే విమర్శను వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని ఆయన ఆయన అన్నారు. పోతిరెడ్డి హెడ్రెగ్యులేటర్పై పిసిసి అధ్యక్షుడు కె. కేశవరావుతో చర్చించామని, అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి సమాధానం చెప్పామని ఆయన వివరించారు.
Story first published: Monday, December 26, 2005, 23:53 [IST]