వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అవగాహన లేకనే ఆందోళన: రఘువీరారెడ్డి
తిరుపతి: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కొత్త విషయమేమీ కాదని, దానిపై అవగాహన లేకనే దాన్ని వ్యతిరేకిస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి ఎన్. రఘువీరా రెడ్డి అన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్పై అవగాహన లేకనే కొంత మంది ఆందోళన చెందుతున్నారని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
ఇతర ప్రాంతాల రైపేరియన్ హక్కులకు భంగం వాటిల్లకుండా పోతిరెడ్డి హెడ్రెగ్యులేటర్కు మిగులు జలాలను మాత్రమే వాడుతామని ఆయన స్పష్టం చేశారు. అన్ని పార్టీలతో చర్చింనిన తర్వాతనే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్పై నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు.
Comments
Story first published: Monday, December 26, 2005, 23:53 [IST]