వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నక్సల్స్‌పైకి మిలిటరీని దింపుతాం: జానారెడ్డి

By Staff
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: నక్సలైట్ల దాడులను తిప్పికొట్టడానికి అవసరమైతే మిలిటరీని ప్రయోగిస్తామని హోం మంత్రి కె. జానా రెడ్డి చెప్పారు. నక్సలైట్ల దాడులను తిప్పికొట్టడానికి ఏజెన్సీ ప్రాంతాల్లోనే కాకుండా అన్ని ప్రాంతాల్లో పోలీసు స్టేషన్‌లకు భద్రత పెంచుతామని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు.

నక్సలైట్లతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగానే ఉందని, అయితే ఇరు వైపులా పట్టువిడుపులు ఉండాలని ఆయన అన్నారు. ప్రజలను భయాందోళనలకు గురి చేయడానికే మావోయిస్టులు రాకెట్‌ లాంఛర్లు ఉపయోగిస్తున్నారని ఆయన అన్నారు. విజయనగరం జిల్లా కునేరు ఘటనలో ఇంటలిజెన్స్‌ వైఫల్యం లేదని ఆయన అన్నారు. హింసను ప్రతి ఒక్కరూ ఖండించాలని ఆయన అన్నారు. మాజీ హోం మంత్రి ఎ. మాధవరెడ్డి, మాజీ స్పీకర్‌ శ్రీపాదరావు, శాసనసభ్యుడు సి. నర్సిరెడ్డి హత్యలను ఆయన ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X