సాగునీటి ప్రాజెక్టులపై టిడిపి ప్రాంతీయ ఉద్యమాలు
విజయవాడ: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లి నరహంతకుడు తాడిపత్రి రామారావును పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణా జిల్లా విస్సన్నపేటలో రామారావును, అతని అనుచరుడు ఏసును పోలీసులు అరెస్టు చేశారు. కోళ్లఫారం యజమానితో పాటు అతని నలుగురు సోదరులు వెంటపడడంతో రామారావు ప్రజల చేతికి చిక్కాడు. అతని అనుచరులు ఇద్దరు పారిపోయారు.
రామారావు, అతని అనుచరులు విస్సన్నపేట సమీపంలోని చెండ్రుపట్లలో ఒక యువతిపై అత్యాచారం జరిపి, కోళ్లఫారంలో దోపిడీకి పాల్పడ్డారు. రామారావు దోపిడీకి పాల్పడుతుండగా ప్రజలు అతన్ని పట్టుకున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆ యువతిని పోలీసులు తిరువూరు ఆస్పత్రికి పంపించారు. మరో ముగ్గురు రామారావు అనుచరుల ఆచూకీ తెలిసిందని, త్వరలోనే వారిని పట్టుకుంటామని పోలీసు సూపరింటిండెంట్ చంద్రమౌళి చెప్పారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లి గ్రామంపై రామారావు ముఠా దాడి చేసి ఆరుగురిని నరికి చంపిన విషయం తెలిసిందే. పాత నేరస్థుడైన రామారావు తన తమ్ముడి హత్యకు ఆగ్రహించి గ్రామంపై దాడి చేశాడు. ఆ దాడిలో పలువురు గాయపడ్డారు.