వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఐఐయస్సిపై దాడి: హైదరాబాద్లో 4గురు అరెస్టు
హైదరాబాద్: బెంగుళూర్లోని ఐఐయస్సిపై తీవ్రవాదుల దాడికి సంబంధించిన కుట్ర బట్టబయలైంది. ఐ ఐయన్సిపై తీవ్రవాదుల దాడిలో పూరి అనే ఐఐటి ప్రొఫెసర్ మరణించిన విషయం తెలిసిందే. ఈ దాడికి హైదరాబాద్లో కుట్ర జరిగినట్లు పోలీసులు కనుక్కున్నారు. ఇందుకు సంబంధించి పోలీసులు నలుగురిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. లష్కర్ - ఎ - తోయిబా సంబంధాలతో బెంగుళూర్లోని ఐఐయస్సిపై దాడి జరిగినట్లు పోలీసులకు ప్రాథమిక సమాచారం లభించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని హైదరాబాద్ పోలీసులు ధృవీకరించడం లేదు.
Comments
Story first published: Friday, December 30, 2005, 23:53 [IST]