హైదరాబాద్లో వరస పేలుళ్ల కుట్ర భగ్నం
హైదరాబాద్: ఢిల్లీ తరహాలో హైదరాబాద్లో వరుస బాంబు పేలుళ్లకు ఐయస్ఐ తీవ్రవాదులు పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఇద్దరు మానవబాంబులను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెల్ఫోన్ ద్వారా పేల్చివేయగలిగే మూడు శక్తివంతమైన బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకుని వాటిని నిర్వీర్యం చేశారు. ఈ పేలుళ్ల కుట్రకు ఇటీవల అరెస్టయిన జాహెద్ సోదరుడు షాహెద్ ప్రధాన సూత్రదారుడని పోలీసులు గుర్తించారు.
హైదరాబాద్ పాతబస్తీలోని లాడ్బజార్ ప్రాంతంలో షకీల్ అనే తీవ్రవాదిని, మూసారాంబాగ్ ప్రాంతంలో హదీ అనే తీవ్రవాదిని పోలీసులు అరెస్టు చేయడంతో వరస బాంబు పేలుళ్ల కుట్ర భగ్నమైంది. వారి నుంచి తీవ్రవాదుల హిట్లిస్టును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తీవ్రవాదుల హిట్లిస్టులో పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) కార్యాలయం, హైదరాబాద్ పోలీస్ కమీషనరేట్, హైటెక్ సిటీ ఉన్నట్లు సమాచారం.
హైదరాబాద్లో భారీ విధ్వంసానికి కుట్ర పన్నిన నలుగురు తీవ్రవాదులకు ఈ నెల 16వ తేదీ వరకు జ్యుడిష్యల్ కస్టడీ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వీరు జైష్ - ఎ - మొహ్మద్ తీవ్రవాదులని సమాచారం.