వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిజెపి అధ్యక్షపదవి చేపట్టిన రాజనాథ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయాధ్యక్షుడిగా సోమవారంనాడు పదవీ బాధ్యతలు స్వీకరించారు. మాజీ అధ్యక్షుడు ఎల్‌. కె. అద్వానీ రాజనాథ్‌సింగ్‌కు బాధ్యతలు అప్పగించారు. రాజనాథ్‌ నాయకత్వంలో పార్టీ నూతన శిఖరాలను అందుకోగలదని, దేశ అభివృద్ధికి సమర్థమైన పనిముట్టుగా మారగలదని అద్వానీ ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమానికి మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి కూడా హాజరయ్యారు. రాజనాథ్‌ సింగ్‌కు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ పదవి ప్రతిష్ట కాదని, ముళ్ల కిరీటమని ఆయన అన్నారు. ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లను నూతన సంవత్సరం సందర్భంగా ఎదుర్కోవడానికి సిద్ధం కావాలని ఆయన రాజనాథ్‌ సింగ్‌కు సూచించారు.

ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి జస్వంత్‌ సింగ్‌, ప్రమోద్‌ మహాజన్‌, ఎం. వెంకయ్యనాయుడు వంటి పలువురు నాయకులు హాజరయ్యారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X