వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య
వరంగల్: వరంగల్లోని ఎల్లంబజార్లో ఇద్దరు దంపతులు తమ ఇద్దరు కూతుళ్లకు సైనైడ్ ఇచ్చి తామూ ఆత్మహత్య చేసుకున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఈ నలుగురు మరణించడంతో ఆ ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది. స్వర్ణకారుడైన వెంకటేశ్వరరావు ఆర్థిక ఇబ్బందుల వల్ల భార్య ధనలక్ష్మికి, ఇద్దరు కూతుళ్లకు సైనైడ్ ఇచ్చి చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెప్పారు.
కొడుకు వినయ్కు మాత్రం వెంకటేశ్వరరావు సైనైడ్ ఇచ్చే ధైర్యం చేయలేదని అంటున్నారు. వినయ్ ఒక్కడే ఆ కుటుంబంలో ప్రాణాలతో ఉన్నాడు. తల్లిదండ్రులను, ఇద్దరు సోదరిలను కోల్పోయిన వినయ్ పరిస్థితి దయనీయంగా ఉంది.
Comments
Story first published: Monday, January 2, 2006, 23:53 [IST]