వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒరిస్సాలో 8 మంది గిరిజనుల కాల్చివేత

By Staff
|
Google Oneindia TeluguNews

భోపాల్‌: టాటా ఉక్కు కర్మాగారం ప్రహారిగోడ వివాదం ఒరిస్సాలో ఎనిమిది మంది గిరిజనుల ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ఘటనలో ఒక కానిస్టేబుల్‌ కూడా మరణించాడు. ఒరిస్సాలోని జాజ్‌నగర్‌ జిల్లా కళింగనగర్‌లో గల టాటా ఉక్కు కర్మాగారం ప్రహారిగోడ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ వందల కొద్ది గిరిజనులు అక్కడికి చేరుకున్నారు. ఈ సమయంలో పోలీసులకు, గిరిజనులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

టాటా ఉక్కు కర్మాగారంలోకి ప్రవేశించడానికి గిరిజనులు ప్రయత్నించారని, అందుకు అడ్డగించిన తమసై గిరిజనులు రాళ్లు రువ్వారని, బాణాలతో దాడి చేశారని పోలీసులు అంటున్నారు. గిరిజనులపై లాఠీచార్జి చేసినా పరిస్థితి అదుపులోకి రాలేదని, దాంతో తాము కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. పోలీసుల కాల్పుల్లో ఎనిమిది గిరిజనులు మరణించారు. గిరిజనుల దాడిలో ఒక కానిస్టేబుల్‌ మరణించాడు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X