వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రోడ్డు ప్రమాదాల్లో 18 మంది దుర్మరణం
హైదరాబాద్: రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో జరిగిన నాలుగు ఘోర రోడ్డు ప్రమాదాల్లో 18 మంది మృత్యువాత పడ్డారు. మెదక్ జిల్లా సదాశివపేట మండలం ఆరూర్ వద్ద ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసి బస్సు, కారు ఢీకొట్టుకోవడంతో ఏడుగురు మరణించారు. ప్రకాశం జిల్లా తోకపల్లి వద్ద లారీ, ఆటో ఢీకొట్టుకోవడంతో ఆరుగురు మృతి చెందారు. నిజామాబాద్ జిల్లా చెంగల్ గ్రామం వద్ద ఇసుక లారీ బోల్తా పడి ఇద్దరు మరణించారు. అనంతపురం జిల్లా మన్నం వద్ద లారీ రోడ్డు పక్కన గల చెట్టును ఢీకొన్న సంఘటనలో ముగ్గురు మరణించారు.
Story first published: Tuesday, January 3, 2006, 23:53 [IST]