వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో హెల్మెట్లు: హైకోర్టు
హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో ద్విచక్రవాహనదారులు హెల్మెట్లు ధరించడాన్ని అనివార్యం చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. నెలకో పట్టణంలో హెల్మెట్ల ధారణను ప్రవేశపెట్టాలని సూచించింది. నెల రోజుల లోగా హైదరాబాద్, సికింద్రబాద్ జంటనగరాల్లో హెల్మెట్ను తప్పనిసరి చేయాలని కూడా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
సెల్ఫోన్లో మాట్లాడుతూ డ్రైవ్ చేసేవారిపై జరిమానా విధించాలని కూడా హైకోర్టు సూచించింది. ఐయస్ఐ మార్కు హెల్మెట్ల కొరత లేకుండా చర్యలు చేపట్టాలని కూడా సూచించింది. 15 ఏళ్ల పైబడిన పాఠశాల బస్సులను రద్దు చేయాలని హైకోర్టు ఆదేశించింది.
Comments
Story first published: Tuesday, January 3, 2006, 23:53 [IST]