వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాలచక్రను ప్రారంభించిన దలైలామా
గుంటూరు: గుంటూరు జిల్లాలోని అమరావతిలో కాలచక్ర ఉత్సవాలను బౌద్ధ మతగురువు దలైలామా గురువారంనాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా బౌద్ధ భిక్షువులకు ఆయన ప్రాథమిక సందేశం ఇచ్చారు. విజ్ఞానాన్ని, జ్ఞానాన్ని ఉపయోగించుకోవడానికి దీక్ష ఉపయోగపడుతుందని, ఈ దీక్షను శ్రద్ధతో నిర్వహించాలని ఆయన బౌద్ధభిక్షువులకు ఉపదేశించారు. గురువులు చెప్పిన విధంగా దీక్ష పూర్తి చేయాలని ఆయన చెప్పారు.
బౌద్ధ మతగురువు దలైలామా బుధవారంనాడు అమరావతికి చేరుకున్నారు. అంతకు ముందు ఆయన నాగార్జునసాగర్ను సందర్శించారు.
Story first published: Thursday, January 5, 2006, 23:53 [IST]