వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నట్వర్ సింగ్కు ఉద్వాసన: చోటు దక్కని రాహుల్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) నుంచి మాజీ విదేశాంగ మంత్రి నట్వర్సింగ్కు ఉద్వాసన పలికారు. ఇరాక్ చమురు కుంభకోణంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కున్న నట్వర్ సింగ్ను సిడబ్ల్యుసి నుంచి తప్పించడమే మంచిదని భావించినట్లు తెలుస్తోంది. సిడబ్ల్యుసిలో రాజీవ్ గాంధీ కుమారుడు రాహుల్ గాంధీకి కూడా చోటు దక్కలేదు.
నూతన ప్రధాన కార్యదర్శులుగా అంబికాసోనీ, అశోక్ గెహ్లాట్, మోతీలాల్ వోరా, ముకుల్ వాస్నిక్, వి. నారాయణస్వామి, బి.కె. హరిప్రసాద్ ఎంపికయ్యారు. అంబికా సోనీ మీడియా ప్రతినిధిగా వ్యవహరిస్తారు.
Comments
Story first published: Friday, January 6, 2006, 23:53 [IST]