వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
టీచర్లపై లాఠీ ప్రయోగం: పలువురికి గాయాలు
చిత్తూరు: చిత్తూరు జిల్లా విద్యాధికారి (డిఇవో) కార్యాలయంలో ఉపాధ్యాయులపై పోలీసులు శుక్రవారం తీవ్రంగా లాఠీచార్జి చేశారు. ఈ లాఠీచార్జిలో పలువురు ఉపాధ్యాయులు గాయపడ్డారు. డి ఇవోపై ఉపాధ్యాయులు తీవ్రంగా మండిపడ్డారు. డి ఇవో చర్యను వారు తీవ్రంగా ఖండించారు.
డి ఇవో ఉపాధ్యాయులును అక్రమంగా సస్పెండ్ చేస్తూ లక్షల రూపాయలు గుంజుతున్నాడని ఆరోపిస్తూ ఉపాధ్యాయులు శుక్రవారం కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ విషయం ముందే తెలుసుకున్న డిఇవో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసుకున్నారు. ధర్నా చేయడానికి వచ్చిన ఉపాధ్యాయులు డిఇవో బయటకు రావాలంటూ నినాదాలు ఇచ్చారు. ఎంతకీ డి ఇవో బయటకు రాకపోవడంతో టీచర్లు లోనికి ప్రవేశించారు. వారిని నెట్టేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే ఆ ప్రయత్నం ఫలించలేదు. దీంతో పోలీసులు టీచర్లపై లాఠీలు ప్రయోగించారు.
Comments
Story first published: Friday, January 6, 2006, 23:53 [IST]