వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసమ్మతి ఎమ్యెల్యేలతో నరేంద్ర మంతనాలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: పార్టీ అసమ్మతి శాసనసభ్యులతో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అగ్రనేత, కేంద్ర మంత్రి ఎ. నరేంద్ర శుక్రవారంనాడు సమావేశమయ్యారు. త్వరలో జరుగనున్న తెరాస శాసనసభా పక్ష సమావేశం నేపథ్యంలో ఆ సమావేశం లోగానే అసమ్మతి శాసనసభ్యులను బుజ్జగించే ప్రయత్నంలో భాగంగా ఈ సమావేశం జరిగినట్లు భావిస్తున్నారు.

ఈ సమావేశానికి అసమ్మతి శాసనసభ్యుడు మందాడి సత్యనారాయ రెడ్డి, ఎస్‌. సంతోష్‌ రెడ్డి, లక్ష్మారెడ్డి మాత్రమే హాజరయ్యారు. దుగ్యాల శ్రీనివాసరావు, శారారాణి, గీట్ల ముకుంద రెడ్డి, జయప్రకాశ్‌ రెడ్డి వంటి ఇతర అసమ్మతి శాసనసభ్యులు హాజరు కాలేదు. ఇందులో కొందరికి సమాచారం లేదని, మరికొందరు సమావేశానికి హాజరు కావడానికి సున్నితంగా తిరస్కరించారని అంటున్నారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి పార్టీ వైదొలగాలని మాజీ మంత్రి, తెరాస శాసనసభ్యుడు ఎస్‌. సంతోష్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X