వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విశాఖలో నేదురుమల్లి కారు దొంగతనం
విశాఖపట్నం: మాజీ ముఖ్యమంత్రి, పార్లమెంటు సభ్యుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కారును ఆగంతకులు శుక్రవారంనాడు దొంగిలించారు. అయితే ఆ కారును పోలీసులు కనుక్కున్నారు. శుక్రవారం ఉదయం తొమ్మిదిన్నర, పది గంటల మధ్య ఈ దొంగతనం జరిగింది. టిటిడి జంక్షన్ వద్ద ఆపి ఉంచిన నేదురుమల్లి కారును దొంగలు ఎత్తుకెళ్లారు. దాన్ని కార్పోరేషన్ కార్యాలయం వద్ద ఆగి ఉండగా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ కారులో కొన్ని డాక్యుమెంట్లు ఉన్నట్లు సమాచారం.
ఇదిలావుంటే, ఇటీవలి యలమంచిలి శాసనసభ్యుడి ఇంట్లో చోరీ జరిగింది. ఇంట్లోని కొన్ని ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లినట్లు సమాచారం. ఈ సమయంలో ఆయన కారును కూడా దొంగలు తీసికెళ్లారు. ఆ కారును విజయనగరం వద్ద పోలీసులు కనుక్కున్నారు. విశాఖపట్నంలో జరుగుతున్న ఈ తరహా దోపిడీలు పోలీసులకు సవాళ్లు విసురుతున్నాయి.
Comments
Story first published: Friday, January 6, 2006, 23:53 [IST]