వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాలచక్రపై చైనా గూఢచారుల నిఘా: దలైలామా
గుంటూరు: తమ ప్రార్థనలపై చైనా గూఢచారులు నిఘా వేశారని బౌద్ధ మత గురువు దలైలామా ఆరోపించారు. గుంటూరు జిల్లా అమరావతిలో జరుగుతున్న కాలచక్ర కార్యక్రమంలో ఆయన బౌద్ధ భిక్షువుల చేత ప్రార్థనలు చేయించారు. టిబెట్ స్వాతంత్య్రం కోసం తాము శాంతియుతంగా ప్రార్థనలు చేస్తున్నామని, దీనిపై నిఘాకు చైనా గూఢచారులను పంపిందని ఆయన అన్నారు. కాలచక్రపై నివేదిక ఇవ్వడానికి చైనా గూఢచారులను పంపిందని ఆయన అన్నారు.
చైనా ఆగడాలను శృతి మించిపోతున్నాయని, సంతోషంగా బతకడం తెలిస్తే స్వేచ్ఛను సాధించడం తేలిక అనే విషయాన్ని అర్థం చేసుకోవడం లేదని ఆయన అన్నారు. సంస్కృతం, తెలుగు, చైనా, టిబెట్ భాషల్లో ప్రార్థనలు జరిగాయి.
Comments
Story first published: Sunday, January 8, 2006, 23:53 [IST]