వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగుకు కేంద్రం అన్యాయం చేసింది: దాసరి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తెలుగును ప్రాచీన భాషగా గుర్తించి, రెండో అధికార భాషగా గుర్తింపు ఇవ్వకపోతే పార్లమెంటు సభ్యులందరూ రాజీనామా చేయాలని కేంద్ర మంత్రి దాసరి నారాయణరావు అన్నారు. తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన విజ్ఞుల సమావేశంలో ఆయన ఆదివారంనాడు మాట్లాడారు. తెలుగుకు కేంద్రం అన్యాయం చేస్తోందని ఆయన విమర్శించారు. తెలుగు భాష కోసం తాను పదవిని త్యాగం చేస్తానని ఆయన చెప్పారు.

తెలుగు భాషకు కేంద్రం అన్యాయం చేస్తుంటే పార్లమెంటు సభ్యులందరూ చూస్తూ కూర్చున్నారని ఆయన అన్నారు. తెలుగును ప్రాచీన భాషగా గుర్తించే వరకు పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు కలిసి పార్టీలకు అతీతంగా ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. తెలుగు భాష కోసం జరిగే ఉద్యమంతో కలిసి రాని ఎంపీలను ప్రజలు బహిష్కరించాలని ఆయన పిలుపునిచ్చారు. తెలుగుకు ప్రాచీన భాష హోదా ఇవ్వకపోతే పార్లమెంటు సభ్యులు, మంత్రులు రాజీనామా చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X