వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బహిష్కరణ కోర్టు పరిధిలోకి రాదు: సోమనాథ్
న్యూఢిల్లీ: కోర్టు నోటీపసులకు తాను ప్రతిస్పందించబోనని లోక్సభ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ చెప్పారు. లంచం తీసుకుంటూ పట్టుబడి పార్లమెంటు నుంచి బహిష్కరణకు గురైన ఒక పార్లమెంటు సభ్యుడు వేసిన పిటిషన్పై కోర్టు ఇచ్చిన నోటీసులపై ఆయన ఆదివారం ప్రతిస్పందించారు.
ఎంపీలపై తీసుకున్న చర్యలకు దేశవ్యాప్తంగా మద్దతు లభించిందని ఆయన అన్నారు. ఎంపీల బహిష్కరణ అంశం కోర్టు పరిధిలోకి రాదని ఆయన చెప్పారు. ఎంపీల క్రమశిక్షణ వ్యవహారాల్లో సర్వాధికారాలు పార్లమెంటుకు ఉన్నాయని ఆయన చెప్పారు. ఎంపిల బహిష్కరణ తొందరపాటుతో తీసుకున్న నిర్ణయం కాదని ఆయన అన్నారు.
Comments
Story first published: Sunday, January 8, 2006, 23:53 [IST]