వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సంయమనం అవసరం: వైయస్కు వెంకయ్య సలహా
రాజమండ్రి: సంయమనంతో వ్యవహరించాలని భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయ ఉపాధ్యక్షుడు వెంకయ్యనాయుడు ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డికి సలహా ఇచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు విమర్శలు రావడం సహజమని, ఇటువంటి సందర్భాల్లో ఓపికతో, సంయమనంతో వ్యవహరించడం అవసరమని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
రాజశేఖర్ రెడ్డి రెండు పత్రికలను వేరు చేసి మాట్లాడటం, ప్రతిపక్షాలపై వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షాలు ప్రభుత్వాల తప్పులు వెతికే ప్రయత్నాలే చేస్తాయని, ప్రతిపక్షాలు చేసే విమర్శలను సత్తా వుంటే సమర్థంగా తిప్పి కొట్టాలే తప్ప సంయమనం కోల్పోయి మాట్లాడటం సరైంది కాదని ఆయన అన్నారు. తాము పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదని, అయితే నిర్వాసితులకు స్పష్టమైన ప్యాకేజీని ప్రకటించాలని తాము డిమాండ్ చేస్తున్నామని ఆయన చెప్పారు.
Comments
Story first published: Sunday, January 8, 2006, 23:53 [IST]