వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రజాసమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి: సిపియం
విజయనగరం: పాదయాత్రల ద్వారా ప్రజా సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని సిపియం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు చెప్పారు. సమైకాంధ్ర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా సాగిన జిల్లాల్లోని పాదయాత్రల ముగింపు సందర్భంగా విజయనగరంలో మంగళవారంనాడు భారీ ఊరేగింపు జరిగింది. ఈ సందర్భంగా రాఘవులు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
సమైక్యాంధ్ర సమగ్రాభివృద్ధే తమ లక్ష్యమని, ఇందుకు అవసరమైన ప్రణాళికను రూపొందిస్తామని ఆయన చెప్పారు. వెనకబడిన ప్రాంతాల, జిల్లాల సమగ్రాభివృద్ధి సాధించి సమైక్యాంధ్రకు కృషి చేస్తామని ఆయన చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం పని తీరు ఏమీ బాగా లేదని ఆయన అభిప్రాయపడ్డారు. కరువు ప్రాంతాలను, వెనకబడిన జిల్లాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు.
Comments
Story first published: Tuesday, January 10, 2006, 23:53 [IST]