బాబు ఫోన్ ట్యాపింగ్పై దర్యాప్తు: జానారెడ్డి
తిరుపతి: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దర్యాప్తు జరుగుతోందని హోం మంత్రి కె. జానారెడ్డి చెప్పారు. సాక్ష్యాధారాలు ఏమైనా వుంటే అందజేయాలని ఆయన చంద్రబాబునాయుడును కోరారు. సాక్ష్యాధారాలను అందజేస్తే దర్యాప్తు సులభమవుతుందని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితికి ఢోకా లేదని ఆయన అన్నారు. మావోయిస్టులు, ఐయస్ఐ తీవ్రవాదుల సమస్యలు ఉన్నప్పటికీ అవి శాంతిభద్రతలకు విఘాతం కలిగించలేవని ఆయన అన్నారు. మావోయిస్టులు, ఐయస్ఐ తీవ్రవాదుల కార్యకలాపాలను అరికట్టడానికి తాము వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నామని ఆయన చెప్పారు. ప్రవాస్ భారతీయ దివస్, సైన్స్ కాంగ్రెస్లకు ముప్పు వాటిల్లుంతుదనే భయాందోళనలు వ్యక్తమయ్యాయని, పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి అవాంఛనీయ సంఘటనలేవీ జరగకుండా చూశారని, శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయనడానికి ఈ ఇవి నిదర్శనమని ఆయన అన్నారు.