వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎమ్మెల్యే వెంకటరెడ్డి హత్యకు నక్సల్స్ కుట్ర
ఖమ్మం: ఖమ్మం జిల్లా సుజాత్నగర్ శాసనసభ్యుడు రాంరెడ్డి వెంకటరెడ్డిని హత్య చేసేందుకు మావోయిస్టులు కుట్ర చేశారు. ఈ కుట్రను పోలీసులు భగ్నం చేశారు. దామోదర్ రెడ్డి ఎక్కవగా వెళ్లే ఖమ్మం - ఇల్లెందు ప్రధాన రహదారిపైన మందుపాతరలు అమర్చి వెంకటరెడ్డిని హత్య చేయడానికి కుట్ర పన్నారని పోలీసులు అంటున్నారు.
ఈ మందుపాతరలను పోలీసులు బుధవారంనాడు గుర్తించారు. వాటిని వెలికి తీసి నిర్వీర్యం చేసేందుకు కూడా వీలు కాలేదు. దీంతో రోడ్డుకు ఇరువైపులా ట్రాఫిక్ను నిలిపేసి వాటిని పేల్చివేశారు. వెంకటరెడ్డి ఈ రహదారిపై ఎక్కువగా వెళ్తుండడం గమనించే మావోయిస్టులు మందుపాతరలు అమర్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
Comments
Story first published: Wednesday, January 11, 2006, 23:53 [IST]