వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముఖ్యనేతలతో కెసిఆర్‌ సమాలోచనలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అగ్రనేత కె. చంద్రశేఖర్‌ రావు శుక్రవారంనాడు పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఆదివారంనాడు జరిగే పార్టీ శాసనసభ్యుల సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహం గురించి ఆయన చర్చించినట్లు సమాచారం. తెలంగాణపై కాంగ్రెస్‌ నాయకుల ప్రకటనల నేపథ్యంలో, అసమ్మతి శాసనసభ్యుల బహిరంగ తిరుగుబాటు నేపథ్యంలో ఈ సమావేశం జరుగుతోంది.

అసమ్మతి శాసనసభ్యుడు దుగ్యాల శ్రీనివాస రావు కెసిఆర్‌పై వ్యక్తిగత ఆరోపణలతో తీవ్రంగా విరుచుకుపడ్డారు. అలాగే సంగారెడ్డి శాసనసభ్యుడు జయప్రకాశ్‌ రెడ్డి కూడా కొరకరాని కొయ్యగా మారారు. వీరి సట్ల అనుసరించాల్సిన వైఖరిపై కూడా సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X