తెరాస ఎమెల్యేలు దుగ్యాల, శారారాణి అరెస్టు
వరంగల్/ ఖమ్మం: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె. చంద్రశేఖర్ రావుకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగిన ఆ పార్టీ అసమ్మతి శాసనసభ్యులు దుగ్యాల శ్రీనివాసరావు, బండారు శారారాణిలను పోలీసులు అరెస్టు చేశారు. ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తున్నారనే ఆరోపణపై సోమవారంనాడు తొర్రూరులో పోలీసులు వారిని అరెస్టు చేశారు. చంద్రశేఖర్ రావు బుడుబుక్కల కథలు చెబుతూ కాలం వెళ్లదీస్తున్నారని దుగ్యాల శ్రీనివాసరావు, శారారాణి వ్యాఖ్యానించారు. దుగ్యాల, శారారాణిలకు వ్యతిరేకంగా తెరాస కార్యకర్తలు కూడా వరంగల్ జిల్లా తొర్రూరులో ర్యాలీ నిర్వహించారు. ఇరు పక్షాల ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది. తెరాస ఉత్తర తెలంగాణ కార్యకర్తల సమావేశం ఇక్కడ జరుగుతోంది.
ఇదిలావుంటే, తమ నేత కె. చంద్రశేఖర్ రావు సవాల్ను తాను స్వీకరిస్తున్నట్లు తెరాస అసమ్మతి శాసనసభ్యుడు తూర్పు జయప్రకాష్ రెడ్డి ప్రకటించారు. ఈ నెల 20వ తేదీన తలపెట్టిన తెలంగాణ అభివృద్ధి శంఖారావం సభకు ఏర్పాట్ల కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన సంగారెడ్డిలో ఈ ప్రకటన చేశారు. తాను కొద్ది నెలల్లో తన శాసనసభ సభ్వత్యానికి పోటీ చేసి సంగారెడ్డి నుంచి తిరిగి పోటీ చేసి గెలుస్తానని ఆయన చెప్పారు. తన గెలుపు తర్వాత చంద్రశేఖర్ రావు కూడా రాజీనామా చేసి తిరిగి పోటీ చేయాలని ఆయన సవాల్ చేశారు.