వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎస్కార్ట్‌ కళ్లు గప్పి 5గురు దొంగల పరారీ

By Staff
|
Google Oneindia TeluguNews

కరీంనగర్‌: ఎస్కార్ట్‌ పోలీసుల కన్ను గప్పి కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌లో ఐదుగురు ఖైదీలు పరారయ్యారు. ఆసిఫ్‌బాద్‌ నుంచి వరంగల్‌ జైలుకు తరలిస్తుండగా ఈ సంఘటన జరిగింది. హుజురాబాద్‌లో బస్సు మారుతుండగా ఐదుగురు దొంగలు పరారయ్యారు. వీరు మందమర్రి దోపిడీ కేసులో నిందితులు. వీరంతా ఆదిలాబాద్‌ జిల్లాకు చెందినవారని తెలుస్తోంది.

ఆసిఫాబాద్‌ కోర్టులో హాజరుపరిచి తిరిగి వరంగల్‌ తీసుకొని వస్తుండగా వారు పారిపోయారు. వారికి ఆరుగురు సాయుధ పోలీసులు ఎస్కార్ట్‌గా ఉన్నారు. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఫిర్యాదు మేరకు హుజురాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X