సెహ్వాగ్, ద్రావిడ్ల ప్రపంచ రికార్డు మిస్
లాహోర్: భారత ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రావిడ్ ప్రపంచ రికార్డు మిస్ అయ్యారు. మూడు పరుగుల తేడాతో వారు ఈ రికార్డును మిస్ అయ్యారు. అత్యధిక భాగస్వామ్య రికార్డును సాధించడానికి మూడు పరుగులు చేయాల్సి ఉండగా మూడు పరుగులు చేయాల్సి ఉన్న సమయంలో సెహ్వాగ్ను నవీద్ అవుట్ చేశాడు. అప్పటికి వీరిద్దరి మధ్య అప్పటికి 410 పరుగుల భాగస్వామ్యం నెలకొని వుంది. లాహోర్లో పాకిస్థాన్, భారత్ల మధ్య జరిగిన తొలి క్రికెట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. 47 ఫోర్లు ఒక సిక్సర్తో 254 పరుగులు చేసిన వీరేంద్ర సెహ్వాగ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా ఎంపికయ్యాడు.
రాత్రి కురిసిన వర్షం వల్ల, వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో మంగళవారం ఐదో రోజు ఆట కొద్దిసేపు మాత్రమే జరిగింది. పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్లో చేసిన 679 పరుగుల భారీ స్కోర్కు సమాధానంగా భారత్ తన ఇన్నింగ్స్ను ధాటిగానే ప్రారంభించారు. సెహ్వాగ్తో పాటు ఇన్నింగ్స్ను ప్రారంభించిన ద్రావిడ్ నింపాదిగా ఆడి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ద్రావిడ్ 128 పరుగులు చేసి నాటవుట్గా మిగిలాడు. అయితే భారత్ ఇన్నింగ్స్ ప్రారంభించినప్పటి నుంచి వాతావరణం ఏ మాత్రం అనుకూలించడం లేదు. తడవ తడవలుగా వీరేంద్ర సెహ్వాగ్, ద్రావిడ్ బ్యాటింగ్ చేశారు. వీరిద్దరి ముందు పాకిస్థాన్ బౌలర్లు దాదాపు చేతులెత్తేశారు.
మంగళవారం ఆట ముగిసే సమయానికి భారత్ ఒక వికెట్ నష్టానికి 410 పరుగులు చేసింది. పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్లో యూనిస్, యూసుఫ్, ఆఫ్రిదీ, అక్మల్ సెంచరీలు చేశారు.