వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నకిలీ స్టాంపుల కేసు: తెల్గీకి పదేళ్ల జైలు శిక్ష
ముంబాయి: నకిలీ స్టాంపు పేపర్ల కేసులో అబ్దుల్ కరీం తెల్గీపై ఆరోపణలు నిర్ధారణ అయ్యాయి. తెల్గీని ముంబాయి కోర్టు దోషిగా నిర్ధారించింది. ఇందుకుగాను ప్రత్యేక కోర్టు తెల్గీకి పదేళ్ల కారాగార శిక్ష విధించింది. 17 లక్షల విలువ చేసే నకిలీ స్టాంపు పేపర్లు అమ్మాడని తెల్గీపై 1995లో కేసు నమోదైంది.
తెల్గీపై 40 కేసులున్నాయి. తెల్గీకి శిక్ష పడిన మొదటి కేసు ఇదే. తెల్గీని పూణేలోని యెర్వాడ జైలులో ఉంచారు. తీర్పు వెలువరిస్తున్న సమయంలో తెల్గీ కోర్టులో లేడు. అయితే వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా తెరపై కనిపించాడు. కిక్కిరిసిన కోర్టు హాలులో ప్రత్యేక న్యాయమూర్తి యు.డి. సాల్వీ తన తీర్పును వెలువరించారు. తెల్గీ అనుచరులు సంజయ్ గైక్వాడ్ను, రామ్ రతన్ సోనీని కూడా కోర్టు దోషులుగా నిర్ధారించింది.
Comments
Story first published: Tuesday, January 17, 2006, 23:53 [IST]