వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆంధ్ర కుప్పం ప్రాజెక్టుపై సుప్రీమ్కు: జయలలిత
చెన్నై: పాలార్ నదిపై చిత్తూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన కుప్పం ప్రాజెక్టును ఆపకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తామని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చెప్పారు. పాలార్ నదిపై ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న కుప్పం ప్రాజెక్టుపై గురువారం శాసనసభలో చర్చ జరిగింది. ఈ చర్చకు జయలలిత సమాధానమిచ్చారు.
కుప్పం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపేయాలని కోరుతూ తాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డికి ఒక లేఖ రాశానని, ఆ లేఖకు సమాధానం రాలేదని ఆమె చెప్పారు. జయలలిత సమాధానం అనంతరం మాట్లాడడానికి ప్రతిపక్షాల సభ్యులు ప్రయత్నించారు. అయితే స్పీకర్ అనుమతించలేదు. దీంతో కుప్పం ప్రాజెక్టుపై జయ ప్రభుత్వం మెతక వైఖరి అవలంబిస్తోందని విమర్శిస్తూ డియంకె సహా ప్రతిపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి.
Comments
Story first published: Thursday, January 19, 2006, 23:53 [IST]