వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వర్గీకరణపై సోనియాకు మంద కృష్ణ గడువు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: షెడ్యూల్డ్‌ కులాల (ఎస్‌సి) రిజర్వేషన్ల వర్గీకరణకు మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి (యంఆర్‌పియస్‌) నాయకుడు మంద కృష్ణ మాదిగ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీకి గడువు పెట్టారు. ఎస్‌సి రిజర్వేషన్ల వర్గీకరణపై సోనియా గాంధీ ఈ సాయంత్రం మూడు గంటల లోగా స్పష్టమైన ప్రకటన చేయకపోతే కాంగ్రెస్‌ ప్లీనరీ సందర్భంగా కురుక్షేత్ర జరిపి తీరుతామని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో చెప్పారు.

ఎస్‌సి రిజర్వేషన్ల వర్గీకరణకు స్పష్టమైన చర్యలు తీసుకోకపోతే లక్షలాది మంది తమ కార్యకర్తలు తరలి వచ్చి హైదరాబాద్‌ను దిగ్బంధం చేస్తారని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి నాన్చుడు ధోరణి వల్లనే తాము మహాసభ నిర్వహించాల్సి వస్తోందని ఆయన చెప్పారు. హైదరాబాద్‌లోని కురుక్షేత్రకు వస్తున్న వంద మందికిపైగా యమ్మార్పియస్‌ కార్యకర్తలను పోలీసులు విజయవాడలో అరెస్టు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X