వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నిజామాబాద్లో నలుగురు పిల్ల ఖైదీల పరారీ
నిజామాబాద్: నిజామాబాద్లోని జ్యువైనల్ హోమ్ నుంచి నలుగురు పిల్ల ఖైదీలు బుధవారం రాత్రి పారిపోయారు. హోమ్ వెనక గేటు తాళాలు పగులగొట్టి వారు పరారయ్యారు. గతంలో ఈ జ్యువైనల్ హోమ్ నుంచి 23 మంది పిల్ల ఖైదీలు పరారయ్యారు. అయినా సిబ్బంది తగిన జాగ్రత్త చర్యలు తీసుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సిబ్బంది కొరత వల్లనే పిల్ల ఖైదీలు పారిపోగలిగారని హోమ్ అధికారులు అంటున్నారు. పారిపోయిన నలుగురు పిల్ల ఖైదీలు నిజామాబాద్ జిల్లాకు చెందినవారే.
Story first published: Thursday, January 19, 2006, 23:53 [IST]