వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అనంత ప్రభుత్వ ఆస్పత్రిలో మొద్దు శీను
అనంతపురం: తెలుగుదేశం శాసనసభ్యుడు పరిటాల రవి హత్య కేసులో నిందితుడు జూలకంటి శ్రీనివాస రెడ్డి అలియాస్ మొద్దు శీనును ఆస్పత్రిలో చేర్పించారు. అనారోగ్యంతో బాధపడుతుండడంతో మొద్దు శీనును గురువారంనాడు చికిత్స నిమిత్తం అనంతపురంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. కంటి నొప్పి, చేతి వేలి నొప్పి తీవ్రం కావడంతో మొద్దు శీనును ఆస్పత్రిలో చేర్చినట్లు చెబుతున్నారు.
హైదరాబాద్ సమీపంలోని చందానగర్లో గల ఒక లాడ్జిలో బాంబు తయారు చేస్తుండగా మొద్దు శీను గాయపడి పోలీసులకు చిక్కాడు. అప్పుడు ఆయనకు శస్త్ర చికిత్స జరిగింది. ఆ గాయాలే ఇప్పుడు తిరగదోడినట్లు భావిస్తునాను.
Comments
Story first published: Thursday, January 19, 2006, 23:53 [IST]