వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
శ్రీకాకుళం జిల్లాలో 9మంది ఒరిస్సావాసులు మృతి
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా పలాస మండలం నెమలి నారాయణపురం గ్రామం వద్ద శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మరణించారు. వీరంతా ఒరిస్సాలోని గంజాం జిల్లా గౌతమ్ గ్రామానికి చెందినవారని పోలీసులు చెప్పారు. వీరు సింహాచలం దేవాలయానికి లారీలో వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.
యాత్రికులు ప్రయాణిస్తున్న లారీ గ్రానైట్ రాళ్లను ఢీకొట్టింది. దీంతో మంటలు లేచాయి. ఈ సంఘటనలో లారీ డ్రైవర్, మరో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
Comments
Story first published: Friday, January 20, 2006, 23:53 [IST]