వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కర్ణాటకలో మధ్యంతరానికి కాంగ్రెస్ సై
హైదరాబాద్: హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న ప్లీనరీలో తొలిరోజైన శనివారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. దీనిలో కర్ణాటక సంక్షోభంతో సహా పలు అంశాలు చర్చకు వచ్చాయి. ఈ సందర్భంగా మాట్లాడిన పలువురు నాయకులు కర్ణాటకలో జెడి(ఎస్) తిరుగుబాటు నేత కుమారస్వామికి ఎట్టి పరిస్థితుల్లో మద్దతు తెలుపరాదని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అవసరమైతే కర్ణాటకలో మధ్యంతర ఎన్నికలకు పోవాలని నిర్ఱయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా కర్ణాటక నుండి ప్లీనరీ సమావేశాలకు కేవలం ఒక్క మల్లికార్జున్ ఖార్గె తప్ప మరెవరు హాజరు కాకపోవడం గమనార్హం.
Comments
Story first published: Saturday, January 21, 2006, 23:53 [IST]