వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రెండో టెస్టు నుంచి గంగూలీ ఔట్
ఫైసలాబాద్: భారత పాకిస్తాన్ జట్ల మధ్య శనివారం ప్రారంభమైన రెండో టెస్ట్లో గంగూలికి చోటు దక్కలేదు. జట్టులో ఐదుగురు బౌలర్లను తీసుకున్న కారణంగా గంగూలిని తప్పించాలని మేనేజ్మెంటు నిర్ణయం తీసుకున్నట్టు కెప్టన్ రాహుల్ ద్రావిడ్ తెలిపారు. లాహోర్లో జరిగిన మొదటి టెస్ట్లో గంగూలిని తీసుకున్నప్పటికి ఆయనకు మ్యాచ్లో ఆడే అవకాశం మాత్రం లభించలేదు. గంగూలి స్థానంలో 20 సంవత్సరాల యువ పేస్ బౌలర్ ఆర్పి సింగ్ను జట్టులోకి తీసుకున్నారు. గంగూలి నేతృత్వంలో 2004లో పాక్ గడ్డపై జరిగిన టెస్ట్ సిరీస్లో చారిత్రాత్మక విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా దాదాను తప్పించడం ద్వారా మేనేజ్మెంట్ మరోవివాదానికి తెరతీసినట్టైందని పరిశీలకులు భావిస్తున్నారు.
Comments
Story first published: Saturday, January 21, 2006, 23:53 [IST]