వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వంటకాలకు ఢోకా ఉండదు: రఘువీరారెడ్డి
హైదరాబాద్: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్లీనరీకి విచ్చేసిన ప్రతినిధులకు వివిధ రకాల వంటకాలతో మధురానుభూతిని మిగుల్చుతామని ప్లీనరీ భోజన వసతి ఇన్ఛార్జ్, రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి రఘువీరా రెడ్డి తెలిపారు. ప్రతినిధులకు భోజన వసతి కల్పించడానికి ఉత్తరాది, దక్షిణాది వంటలతో కూడిన ఆరు పుడ్ కోర్టులను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ప్లీనరీ మొదటిరోజు శాఖాహారం మాత్రమే అందించామని, ముఖ్యంగా అందరికీ చల్లని మజ్జిగను అందిస్తున్నామని ఆయన తెలియజేశారు. అతిథులకు ఆంధ్రా సాంబారు, పచ్చళ్లు రుచి చూపిస్తున్నామని ఆయన అన్నారు. ఉత్తరాది వారికోసం వేడి వేడి రొట్టెలను, పూరీలను అందిస్తున్నామని, అన్ని రకాల పండ్లను అందుబాటులో ఉంచామని ఆయన చెప్పారు.
Comments
Story first published: Saturday, January 21, 2006, 23:53 [IST]