వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్‌ భారీ స్కోర్‌: భారత్‌ 110/1

By Staff
|
Google Oneindia TeluguNews

ఫైసలాబాద్‌: పాకిస్థాన్‌ భారీ స్కోర్‌కు జవాబుగా భారత్‌ రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆదివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ ఒక వికెట్‌ నష్టపోయి 110 పరుగులు చేసింది. కెప్టెన్‌ ద్రావిడ్‌ 46 పరుగులతోనూ, వివియస్‌ లక్ష్మణ్‌ 28 పరుగులతోనూ క్రీజ్‌లో ఉన్నారు. అంతకు ముందు ఓపెనర్‌ సెహ్వాగ్‌ 31 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద రజాక్‌ బౌలింగ్‌లో స్లిప్‌లో క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. అనంతరం ద్రావిడ్‌కు తోడుగా లక్ష్మణ్‌ దిగి నింపాదిగా ఆడాడు.

అంతకు ముందు భోజన విరామ సమయానికి ముందు పాకిస్థాన్‌ 588 పరుగుల భారీ స్కోర్‌కు అలవుట్‌ అయింది. కెప్టెన్‌ ఇంజమామ్‌ ఉల్‌ హక్‌, ఆల్‌ రౌండర్‌ ఆఫ్రిదీలు అద్భుతమైన సెంచరీలు నమోదు చేసుకున్నారు. ఇంజమామ్‌ 110 పరుగులు చేసి జహీర్‌ ఖాన్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఆఫ్రిదీ తన టెస్టు కెరీర్‌లోనే అత్యుత్తమ స్కోర్‌ నమోదు చేసుకున్నాడు ఆఫ్రిది 156 పరుగులు చేశాడు. శనివారం ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 379 పరుగులు చేసింది. యూనిస్‌ ఖాన్‌ 83 పరుగులు చేయగా, యూసుఫ్‌ యోహానా కూడా అర్థ సెంచరీ చేశాడు.

భారత బౌలింగ్‌ విషయానికి వస్తే తొలి టెస్టు ఆడుతున్న భారత బౌలర్‌ ఆర్‌.పి. సింగ్‌ నాలుగు వికెట్లు తీశాడు. జహీర్‌, కుంబ్లేలు చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. ఇర్ఫాన్‌ పఠాన్‌, హర్బజన్‌లకు వికెట్లు లభించలేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X