వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెట్టుబడుల ఉపసంహరణపై జాగ్రత్త: కాంగ్రెస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: పెట్టుబడుల ఉపసంహరణ విషయంలో ఎంపిక పద్ధతిని అనుసరించాలని ఎఐసిసి ప్లీనరీ అభిప్రాయపడింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ విషయంలో వామపక్షాలు యుపిఎ ప్రభుత్వంపై పెడుతున్న ఒత్తిళ్ల నేపథ్యంలో కాంగ్రెస్‌ ఆదివారంనాడు ఆ మేరకు తీర్మానం చేసింది. టెలికమ్‌, ఆటోమొబైల్స్‌, ఎయిర్‌లైన్స్‌ వంటి రంగాల్లో సంస్కరణలను వేగవంతం చేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కోరింది.

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విషయంలో వామపక్షాలు ఆక్షేపణలు తెలియజేస్తున్న నేపథ్యంలో ఉన్నవాటిని అప్పగించడం కాకుండా పెట్టుబడులకు కొత్త రంగాలను గుర్తించి వాటిని ఆహ్వానించాలని, ఈ విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని కాంగ్రెస్‌ అభిప్రాయపడింది. సంస్కరణలకు తాము కట్టుబడి ఉన్నామని, అయితే వచ్చే దశాబ్ద కాలంలో భారత్‌ను సూపర్‌ పవర్‌గా నిలబెట్టేందుకు ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల ఐక్యకృషిని ప్రోత్సాహించడం అవసరమని పేర్కొంది.

ప్రపంచ పోటీని తట్టుకునే విధంగా నవరత్న కంపెనీలను బలోపేతం చేయాలని కాంగ్రెస్‌ అభిప్రాయపడింది. నవరత్న కంపెనీలను ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రైవేట్‌పరం చేయకూదని కాంగ్రెస్‌ సూచించింది. సామాజిక కార్యక్రమాల కోసం జాతీయ నిధిని ఏర్పాటు చేయాలని సూచించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X